ETV Bharat / state

RED SANDAL: తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత.. పరారైన స్మగ్లర్లు

author img

By

Published : Jul 7, 2021, 4:08 PM IST

వాహనాల్లో తరలిస్తున్న ఎర్ర చందనాన్ని (RED SANDAL WOOD) చిత్తూరు జిల్లాలో అటవీ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించగా.. స్మగ్లర్లు పరారైనట్లు తెలిపారు.

red sandal wood caught
తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కడపల్లె వద్ద ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 15 లక్షలు విలువ చేసే 404 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.

తెల్లవారుజామున జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా.. ఇన్నోవా, స్కార్పియో వాహనాల్లో తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలతోపాటు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు పారిపోయారన్నారు.

ఇవీ చదవండి:

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కడపల్లె వద్ద ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 15 లక్షలు విలువ చేసే 404 కిలోల బరువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.

తెల్లవారుజామున జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా.. ఇన్నోవా, స్కార్పియో వాహనాల్లో తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలతోపాటు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు పారిపోయారన్నారు.

ఇవీ చదవండి:

బంగాల్ మంత్రి 38 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.