ETV Bharat / state

ఎర్రచందనం దొంగను పట్టుకున్న పోలీసులు - red sandal victim news in chittoor dst

ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇన్నాళ్లు కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ సురేష్ ను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. ఇతనిపై ఇప్పటికే చాల కేసులు ఉన్నాయని టాస్క్ ఫోర్స్ ఇన్ ఛార్జి పి. రవిశంకర్ తెలిపారు.

red sandal victim arrested in chittoor dst tirupati
red sandal victim arrested in chittoor dst tirupati
author img

By

Published : May 31, 2020, 12:18 AM IST

ఎర్ర చందనం అక్రమ రవాణాలో రాటుతేలిన సురేష్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నగర శివారులో తనిఖీలు చేపట్టిన అధికారులు... వినాయకసాగర్ వద్ద అరెస్ట్ చేశారు. సురేష్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ అని టాస్క్ ఫోర్స్ అధికారి పి.రవిశంకర్ తెలిపారు.

ఇతనిపై ఇంతకముందే కొన్ని కేసులు ఉండగా పరారీలో ఉన్నాడు. తిరుచానూరు సమీపంలో కుక్కల పెట్ ఫామ్ పెట్టుకుని, ఆ ముసుగులో ఎర్ర చందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తుంటాడని తెలిపారు. తమిళనాడు నుంచి స్మగ్లర్లును పిలిపించి కావలసిన సౌకర్యాలు కల్పిస్తుంటాడని చెప్పారు. కేసు నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎర్ర చందనం అక్రమ రవాణాలో రాటుతేలిన సురేష్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నగర శివారులో తనిఖీలు చేపట్టిన అధికారులు... వినాయకసాగర్ వద్ద అరెస్ట్ చేశారు. సురేష్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ అని టాస్క్ ఫోర్స్ అధికారి పి.రవిశంకర్ తెలిపారు.

ఇతనిపై ఇంతకముందే కొన్ని కేసులు ఉండగా పరారీలో ఉన్నాడు. తిరుచానూరు సమీపంలో కుక్కల పెట్ ఫామ్ పెట్టుకుని, ఆ ముసుగులో ఎర్ర చందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తుంటాడని తెలిపారు. తమిళనాడు నుంచి స్మగ్లర్లును పిలిపించి కావలసిన సౌకర్యాలు కల్పిస్తుంటాడని చెప్పారు. కేసు నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి 90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.