ETV Bharat / state

'సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీను రద్దు చేయాల్సిందే'

author img

By

Published : Feb 18, 2020, 12:13 PM IST

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ర్యాలీలు, బహిరంగసభలతో నిరసన గళాన్ని వినిపించారు. కేంద్ర ప్రభుత్వం.. మతాల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు.

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరనసలు
సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరనసలు
సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరనసలు

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​పీఆర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... చిత్తూరు నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గా కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గాందీ విగ్రహ కూడలిలో సభ నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.

పీలేరు నియోజకర్గంలో మస్లింలు ఆందోళన చేపట్టారు. ముడు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చిన ముస్లిం మహిళలు పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలికిరిలో ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు.

మదనపల్లిలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ముస్లిం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత జీవనంలో చిచ్చు పెట్టటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు బిల్లులకు వ్యతిరేకంగా బహింరగ సభ నిర్వహించారు. భాజపా మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యనించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాసుపత్రులకు రూ. 670 కోట్లు విడుదల

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరనసలు

సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్​పీఆర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... చిత్తూరు నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గా కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గాందీ విగ్రహ కూడలిలో సభ నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.

పీలేరు నియోజకర్గంలో మస్లింలు ఆందోళన చేపట్టారు. ముడు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చిన ముస్లిం మహిళలు పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలికిరిలో ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు.

మదనపల్లిలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. ముస్లిం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత జీవనంలో చిచ్చు పెట్టటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు బిల్లులకు వ్యతిరేకంగా బహింరగ సభ నిర్వహించారు. భాజపా మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. ఇది సరైన విధానం కాదని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యనించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాసుపత్రులకు రూ. 670 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.