అలిపిరి లింక్ బస్ స్టాండ్లో సంజీవని బస్సు వద్ద కరోనా పరీక్షల కోసం .. క్యూలైన్లో నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు.
మృతుడు తిరుపతి... సప్తగిరి కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా కరోనా పరీక్షల కోసం వచ్చి క్యూలైన్లో నిరీక్షిస్తున్నా.. టెస్టులు చేయలేదని మృతుడు బంధువులు ఆరోపించారు. మృతుడు తండ్రి లే నాన్నా అంటూ విలపించిన తీరు... ఇతరులను సైతం కన్నీరు పెట్టించేలా ఉంది.
ఇదీ చదవండి: లక్షణాలున్నా బయటకు రావడంలేదు... వైరస్ పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం