ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖులు తాజా వార్తలు

తిరుమల శ్రీవారిని ఈరోజు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభం దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు.

Many celebrities in Venkanna service
వెంకన్న సేవలో ప్రముఖులు
author img

By

Published : Nov 22, 2020, 10:11 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఉడిపి పెజావర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామిజీ, భాజాపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బిజేంద్రనాథ్‌ రెడ్డి, బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, చిత్తూరు జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

వీరితోపాటుగా... మధ్యప్రదేశ్​ మంత్రి అరవింద్​ బహుదూరియా, గుజరాత్​ రాష్ట్ర పోరుబందర్​ ఎంపీ రమేష్​ బాయ్​ దుడుకు కూడా స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఉడిపి పెజావర్‌ పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామిజీ, భాజాపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బిజేంద్రనాథ్‌ రెడ్డి, బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, చిత్తూరు జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

వీరితోపాటుగా... మధ్యప్రదేశ్​ మంత్రి అరవింద్​ బహుదూరియా, గుజరాత్​ రాష్ట్ర పోరుబందర్​ ఎంపీ రమేష్​ బాయ్​ దుడుకు కూడా స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు.

ఇవీ చూడండి:

మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.