ETV Bharat / state

నంది విగ్రహం ధ్వంసం... గుప్త నిధుల కోసమేనా..?

author img

By

Published : Sep 27, 2020, 4:52 PM IST

గుప్తనిధులు ఉన్నాయన్న అనుమానంతో దేవాలయంలోని నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా అగరంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lord nandhi statue destroyed in agaram chitthore district
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అగరం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పరివార దేవతలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. మందిర ప్రాంగణంలోని శివాలయం ఎదుట నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత కొన్ని రోజుల క్రితం విగ్రహ పీఠానికి పగుళ్లు ఏర్పడటంతో శాస్త్రోక్తంగా పగుళ్లు పూడ్చి పునః ప్రతిష్ఠించారు.

నిధులు ఉన్నాయని వదంతులు వ్యాప్తి...

నంది విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించిన నాటినుంచి... విగ్రహం కింద విలువైన ఆభరణాలు ఉంచారని వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు... శనివారం ఆర్థరాత్రి నంది విగ్రహాన్ని పెకిలించి, ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన కమిటీ సభ్యులు... నంది విగ్రహం ధ్వంసం ఉండటాన్ని గమనించి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్​డీపీవో ఈశ్వర్ రెడ్డి.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు.

ఇదీచదవండి.

వివేకా హత్య కేసు: సీబీఐ ముందుకు మున్నాతో పాటు చెప్పుల డీలర్లు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అగరం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పరివార దేవతలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. మందిర ప్రాంగణంలోని శివాలయం ఎదుట నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత కొన్ని రోజుల క్రితం విగ్రహ పీఠానికి పగుళ్లు ఏర్పడటంతో శాస్త్రోక్తంగా పగుళ్లు పూడ్చి పునః ప్రతిష్ఠించారు.

నిధులు ఉన్నాయని వదంతులు వ్యాప్తి...

నంది విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించిన నాటినుంచి... విగ్రహం కింద విలువైన ఆభరణాలు ఉంచారని వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు... శనివారం ఆర్థరాత్రి నంది విగ్రహాన్ని పెకిలించి, ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన కమిటీ సభ్యులు... నంది విగ్రహం ధ్వంసం ఉండటాన్ని గమనించి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్​డీపీవో ఈశ్వర్ రెడ్డి.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు.

ఇదీచదవండి.

వివేకా హత్య కేసు: సీబీఐ ముందుకు మున్నాతో పాటు చెప్పుల డీలర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.