ETV Bharat / state

బ్రహ్మోత్సవాలు... కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం - కోనేటి రాయుడి వైభవం

బ్రహ్మాండ నాయకుని కమనీయ ఉత్సవం... కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం... శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కనివినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా వైకుంఠనాధునికి సాగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తజనం సంద్రమై పోటెత్తనుంది. తొమ్మిదిరోజుల పాటు అత్యంత రమణీయంగా జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం
author img

By

Published : Sep 30, 2019, 5:21 AM IST

కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం

కలియుగంలో వేంకటాద్రిని మించిన పుణ్యధామం బ్రహ్మాండంలోనే లేదు. కలియుగాధిపతిగా... శేషాచల నివాసిగా... ఏడుకొండల వెంకన్నగా పూజలందుకుంటున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. గోవిందా అని తలచిన వెంటనే నేనున్నానంటూ పలికి... భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని బ్రహ్మోత్సవ వేళ కనులారా వీక్షించాల్సిందేందుకు భక్తులు పోటెత్తనున్నారు.

దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్త జన సందోహంతో తిరుగిరులు తొమ్మిది రోజుల పాటు కిక్కిరిసిపోనున్నాయి. స్వామి వారికి అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు, అత్యంత ప్రముఖులను తోసిరాజంటూ... సామాన్యునికి బ్రహ్మాండనాయకుని సాక్షాత్కరమే ప్రథమ ప్రాధాన్యంగా ఈ సారి బ్రహ్మోత్సావాలను నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

మీన లగ్న శుభముహూర్తాన సాయంత్రం 5.23 నిమిషాలకు ధ్వజారోహణ ప్రారంభం కానుంది. అనంతరం స్వామి వారికి పెద్దశేష వాహన సేవ జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేవ 10 గంటలవరకు నిర్వహించనున్నారు. ఏడు పడగల శేషుడిపై... శ్రీదేవి భూదేవీ సమేతుడైన మలయప్పస్వామి కొలువు తీరి... మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. తిరువాభరణములు ధరించి పెద్దశేషవాహనుడిపై ఉభయదేవేరుల సమేతుడైన మలయప్పస్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది ప్రశస్తి.

స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. బ్రేక్ దర్శనాలను, చిన్నపిల్లల తల్లుల, వృద్ధులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం

కలియుగంలో వేంకటాద్రిని మించిన పుణ్యధామం బ్రహ్మాండంలోనే లేదు. కలియుగాధిపతిగా... శేషాచల నివాసిగా... ఏడుకొండల వెంకన్నగా పూజలందుకుంటున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. గోవిందా అని తలచిన వెంటనే నేనున్నానంటూ పలికి... భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని బ్రహ్మోత్సవ వేళ కనులారా వీక్షించాల్సిందేందుకు భక్తులు పోటెత్తనున్నారు.

దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్త జన సందోహంతో తిరుగిరులు తొమ్మిది రోజుల పాటు కిక్కిరిసిపోనున్నాయి. స్వామి వారికి అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు, అత్యంత ప్రముఖులను తోసిరాజంటూ... సామాన్యునికి బ్రహ్మాండనాయకుని సాక్షాత్కరమే ప్రథమ ప్రాధాన్యంగా ఈ సారి బ్రహ్మోత్సావాలను నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

మీన లగ్న శుభముహూర్తాన సాయంత్రం 5.23 నిమిషాలకు ధ్వజారోహణ ప్రారంభం కానుంది. అనంతరం స్వామి వారికి పెద్దశేష వాహన సేవ జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేవ 10 గంటలవరకు నిర్వహించనున్నారు. ఏడు పడగల శేషుడిపై... శ్రీదేవి భూదేవీ సమేతుడైన మలయప్పస్వామి కొలువు తీరి... మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. తిరువాభరణములు ధరించి పెద్దశేషవాహనుడిపై ఉభయదేవేరుల సమేతుడైన మలయప్పస్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది ప్రశస్తి.

స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. బ్రేక్ దర్శనాలను, చిన్నపిల్లల తల్లుల, వృద్ధులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Intro:AP_RJY_86_29_Rajahmundry_Dasara_Uthatsavalu_AV_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram.

( ) దసరా వేడుకలకు ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరం లోని దేవీచౌక్ ముస్తాబైంది.ఐదు రోడ్ల కూడలి కావడంతో అన్ని మార్గంలోని భారీ పందిళ్లు వేసి వివిధ దేవతా మూర్తులు రూపాల్లో విద్యుద్దీపాలను అలంకరించారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు. శ్రీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించడానికి చుట్టుప్రక్కల నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు.




Body:AP_RJY_86_29_Rajahmundry_Dasara_Uthatsavalu_AV_AP10023


Conclusion:AP_RJY_86_29_Rajahmundry_Dasara_Uthatsavalu_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.