యువ నటుడు నవీన్ పోలిశెట్టి, ఫరియా జంటగా నటించిన జాతిరత్నాలు చిత్రం... విడుదలైన దగ్గర నుంచి నవ్వుల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. తిరుపతిలో సందడి చేసిన చిత్రబృందాన్ని తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ నిర్వాహకులు సన్మానించారు.
అనంతరం హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, ఫరియా, చిత్ర దర్శకుడు కేవీ అనుదీప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తమ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడవటం మర్చిపోలేని అనుభూతి అని నటుడు నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని.. విజయయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: