ETV Bharat / state

నేడు తిరుపతికి పవన్.. భాజపా అభ్యర్థి తరఫున ప్రచారం - రత్నప్రభ తరఫున పవన్ ప్రచారం

తిరుపతి లోక్​సభ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి రానున్నారు. తర్వాత ఎమ్మార్​పల్లి రోడ్ కూడలి చేరుకుని అక్కడ్నుంచి శంకరంబాడి విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు.

రత్నప్రభ తరఫున ప్రచార పర్వం ప్రారంభించనున్న జనసేనాని
రత్నప్రభ తరఫున ప్రచార పర్వం ప్రారంభించనున్న జనసేనాని
author img

By

Published : Apr 3, 2021, 4:32 AM IST

Updated : Apr 3, 2021, 6:21 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాజపా అభ్యర్ధి రత్నప్రభ తరపున తిరుపతిలో నేడు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి రానున్న పవన్.. రోడ్డు మార్గం ద్వారా తిరుపతిలోని ఎమ్మార్​పల్లి రోడ్ కూడలికి చేరుకుంటారు.

పాదయాత్రగా..

అనంతరం కోమల్ రెడ్డి కూడలి, అన్నమయ్య కూడలి మీదుగా ఎయిర్ బైపాస్ రహదారిలో శంకరంబాడి విగ్రహం వరకు పాదయాత్రగా తరలివెళ్తారు. శంకరం బాడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రచార పర్వంలో జనసేన అధినేతతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, అభ్యర్ధి రత్నప్రభ, ఇతర భాజపా నేతలు పాల్గొంటారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాజపా అభ్యర్ధి రత్నప్రభ తరపున తిరుపతిలో నేడు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి రానున్న పవన్.. రోడ్డు మార్గం ద్వారా తిరుపతిలోని ఎమ్మార్​పల్లి రోడ్ కూడలికి చేరుకుంటారు.

పాదయాత్రగా..

అనంతరం కోమల్ రెడ్డి కూడలి, అన్నమయ్య కూడలి మీదుగా ఎయిర్ బైపాస్ రహదారిలో శంకరంబాడి విగ్రహం వరకు పాదయాత్రగా తరలివెళ్తారు. శంకరం బాడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రచార పర్వంలో జనసేన అధినేతతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, అభ్యర్ధి రత్నప్రభ, ఇతర భాజపా నేతలు పాల్గొంటారు.

ఇవీ చూడండి:

తిరుపతి చేరుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

Last Updated : Apr 3, 2021, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.