ETV Bharat / state

ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు వద్ద మద్యం కోసం పోటెత్తిన జనం

author img

By

Published : May 4, 2020, 2:10 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో 40 రోజులపాటు మూతపడ్డ మద్యం దుకాణాలు నేడు తెరుచుకున్నాయి. ఇన్నాళ్లూ మందు దొరకక అల్లాడిన మద్యం ప్రియులు దుకాణాలు వద్ద బారులు తీరారు.

heavy crowd at wine shops at andhra taminadu border in chittore district
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు వద్ద మద్యం కోసం పోటెత్తిన జనం

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం బలిజ కండ్రిగ ప్రాంతం... తమిళనాడు సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలోనూ ఇవాళ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. జనం మద్యం కోసం ఆరాటపడ్డారు.

పక్క రాష్ట్రంలో మద్యం అమ్మకాల మీద ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా.. పెద్దఎత్తున ప్రజలు సరిహద్దుల వద్ద దుకాణాలకు వచ్చారు. వారిని భౌతిక దూరం పాటించేలా చేయడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. మండే ఎండను సైతం లెక్కచేయకుండా షాపుల ముందు క్యూ కట్టారు. దాదాపు 800 వరకు జనం బారులు తీరారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం బలిజ కండ్రిగ ప్రాంతం... తమిళనాడు సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలోనూ ఇవాళ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. జనం మద్యం కోసం ఆరాటపడ్డారు.

పక్క రాష్ట్రంలో మద్యం అమ్మకాల మీద ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా.. పెద్దఎత్తున ప్రజలు సరిహద్దుల వద్ద దుకాణాలకు వచ్చారు. వారిని భౌతిక దూరం పాటించేలా చేయడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. మండే ఎండను సైతం లెక్కచేయకుండా షాపుల ముందు క్యూ కట్టారు. దాదాపు 800 వరకు జనం బారులు తీరారు.

ఇవీ చదవండి:

మండుటెండలో మద్యం కోసం నిరీక్షణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.