చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది. కులం పేరుతో తమను దూషిస్తూ, దాడులకు పాల్పడుతూ ఓ వర్గం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కొందరు గ్రామస్థులు ఆందోళన చెందారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో భాదితులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు.
మరోవర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ అయిన కారణంగా... తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
ఇదీ చదవండి: