తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్నందున కుప్పం పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించాల్సి ఉంది. ఈనెల 12న కుప్పం పురపాలికలో పర్యటన అనంతరం.. బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ తర్వాత 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది.
ఆ తర్వాత.. 14వ తేదీన కుప్పం గ్రామీణం, గుడుపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటనకు షెడ్యూలు ఖరారు చేశారు. కానీ.. భారీ వర్షాల కారణంగా కుప్పం పర్యటన తాత్కలికంగా వాయిదా పడింది.
సంబంధిత కథనం..