ETV Bharat / state

విషాదం.. యువతి ప్రాణం మింగేసిన బావి

వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువతి బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంటలో చోటు చేసుకుంది.

author img

By

Published : Nov 17, 2019, 3:14 PM IST

ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి
ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి

వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాతగుంటలో జరిగింది. ప్రేమలత అనే యువతి పొలం పని ముగించుకుని చేతులు శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావిలోకి దిగింది. నీళ్లు ఎక్కువగా ఉండటంతో మెట్లన్నీ పాకురు పట్టాయి. ఇది గమనించకపోవటంతో ఆమె కాలుజారి బావిలో పడిపోయింది. పొలం వద్దకు వెళ్లిన ప్రేమలత ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో తల్లీదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. తమ కుమార్తె పాదరక్షలను చూసి ఆమె బావిలో పడినట్లు అనుమానించి కేకలు వేశారు. వారి అరుపులతో పొలం వద్దకు చేరుకున్న గ్రామస్థులు యువతి బావిలో పడినట్లు నిర్ధరించుకుని వెలికితీశారు. ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు

ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి

వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాతగుంటలో జరిగింది. ప్రేమలత అనే యువతి పొలం పని ముగించుకుని చేతులు శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావిలోకి దిగింది. నీళ్లు ఎక్కువగా ఉండటంతో మెట్లన్నీ పాకురు పట్టాయి. ఇది గమనించకపోవటంతో ఆమె కాలుజారి బావిలో పడిపోయింది. పొలం వద్దకు వెళ్లిన ప్రేమలత ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో తల్లీదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. తమ కుమార్తె పాదరక్షలను చూసి ఆమె బావిలో పడినట్లు అనుమానించి కేకలు వేశారు. వారి అరుపులతో పొలం వద్దకు చేరుకున్న గ్రామస్థులు యువతి బావిలో పడినట్లు నిర్ధరించుకుని వెలికితీశారు. ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు

Intro:వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువతి బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం పాతగుంట కు చెందిన రైతు మణిరెడ్డి కి గ్రామానికి ఆనుకొని వ్యవసాయ పొలం ఉంది . ఈ క్రమంలో కుమార్తె ప్రేమ లత(26) ఇంటి నుండి ఆవుపేడను చేసుకొని పొలం వద్దకు వెళ్లింది.


Body:పొలం వద్ద పేడ దిబ్బ వేసిన యువతి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దిగింది. బావి నిండుగా నీరు ఉండడంతో బావి మెట్లు పాచి పట్టి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మునిగిపోయింది. పొలం వద్దకు వెళ్లిన కుమార్తె ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పొలం వద్దకు వచ్చి పేరు పెట్టి పిలిచి నప్పటికీ సమాధానం లేకపోవడంతో అనుమానంతో పరిసరాలను జల్లెడ పట్టారు. బావి ఒడ్డున వున్న యువతి పాదరక్షలను చూసి గుర్తుపట్టిన తల్లిదండ్రులు బావిలో పడి ఉన్నట్లు అనుమానించి కేకలు వేశారు. యువతి తల్లిదండ్రులు కేకలతో సమీపంలోని గ్రామస్తులంతా బావి వద్దకు చేరుకొని, అక్కడి స్థితులను బట్టి యువతి బావిలో పడినట్లు నిర్ధారించుకొని వెలికితీయడానికి ప్రయత్నించారు.


Conclusion:బావిలో నిండుగా నీరు ఉండటం వల్ల సాధ్యం కాకపోవడంతో విద్యుత్ మోటారు సాయంతో బావిలోని నీటిని నిరంతరాయంగా తోడారు. గ్రామంలో ఉన్న పెద్దల సూచనల మేరకు పలువురు యువకులు పాతాళ బేరి సాయంతో గాలింపు చేపట్టారు. సుమారు రెండు గంటల సేపు పాతాళ బేరి తో చేసిన గాలింపు లో యువతి నీటి పైకి వచ్చింది. ఆహా కారాలు చేస్తూ వెలుపలికి తీసి పరీక్షించగా అప్పటికే యువతి మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మహేంద్ర etv bharat జీడి నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.