chandragiri sub-registrar office: చిత్తూరు జిల్లా చంద్రగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఈ దాడులు.. ఇంకా కొనసాగుతున్నాయి.
కార్యాలయానికి తాళాలు పెట్టి అధికారులను, డాక్యుమెంట్ రైటర్స్ను గురువారం ఉదయం 4 గంటల వరకు విచారించారు. సాయంత్రం వరకు అనధికార నగదు లక్ష రుపాయల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పలు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సోదాల్లో ఏసీబీ డీఎస్పీ జనార్థన్ నాయుడుతో పాటు మరో 14 మంది అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి