చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమలో కెమికల్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడివారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. లారీ ఎక్కనుంచి ఎక్కడికి వెళుతోంది.. లారీలో ఎంతమంది ఉన్నారనే వివరాలు ఆరా తీశారు. అయితే లారీలో నుంచి రసాయనాలు విడుదల అవుతుండటం వల్ల దగ్గరకు వెళ్లడానికి పోలీసులు కూడా భయపడ్డారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: