ETV Bharat / state

పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి!

author img

By

Published : Sep 1, 2020, 10:22 PM IST

Updated : Sep 2, 2020, 2:09 AM IST

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడోమైలు వద్ద దుర్ఘటన జరిగింది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరోముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

3-person-died-in-chittoor-due-to-electrick-shock
3-person-died-in-chittoor-due-to-electrick-shock
పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి!

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో..ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర విషాదాన్ని నింపింది. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులు విద్యుదాఘాతంతో మృతిచెందారు.

శాంతిపురం-కడపల్లి మధ్య ఏడో మైలు వద్ద జాతీయ రహదారి పక్కన..30 అడుగుల పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారు. పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి..ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం మృతి దినట్లు...... పోలీసులు గుర్తించారు. వీరంతా కడపల్లికి చెందిన వారుకాగా..రాజేంద్ర(31), సోమశేఖర్(29)..ఆ గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణప్ప కుమారులు. గాయాలైన నలుగురిని కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్......... దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి!

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో..ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర విషాదాన్ని నింపింది. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులు విద్యుదాఘాతంతో మృతిచెందారు.

శాంతిపురం-కడపల్లి మధ్య ఏడో మైలు వద్ద జాతీయ రహదారి పక్కన..30 అడుగుల పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారు. పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి..ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం మృతి దినట్లు...... పోలీసులు గుర్తించారు. వీరంతా కడపల్లికి చెందిన వారుకాగా..రాజేంద్ర(31), సోమశేఖర్(29)..ఆ గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణప్ప కుమారులు. గాయాలైన నలుగురిని కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్......... దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

Last Updated : Sep 2, 2020, 2:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.