కరోనాతో ప్రపంచం భయాందోళనలకు గురవుతున్నా కొంతమంది ఏ మాత్రం ఆ మహమ్మారిని లెక్కచేయడం లేదు. ఇలాంటి ఘటనే పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై చంద్రగిరి సమీపంలో జరిగింది. తమకేమీ పట్టదన్నట్టు ఓ ఆటోలో 20మందికి పైగా ప్రయాణిస్తున్న విజువల్స్ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.
భౌతికదూరం పాటిస్తున్నా.. వ్యాప్తి తగ్గని ప్రస్తుత తరుణంలో కనీసం మాస్కులు కూడా లేకుండా ఇలా ప్రయాణిస్తే తగిన మూల్యం చెల్లిచుకోవాల్సిందేనని అంటున్నారు ప్రజలు. అనవసరంగా బయటకు వస్తున్న వారిపై లాఠీలకు పనిచెప్పే పోలీసులు.... ఇలాంటి వాటిపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: