![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
ఎన్నికల ముందు మామూలే...
సీట్ల సర్దుబాటులో విబేధాల వల్లే కొందరు పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడిన నాయకులు నష్టపోతారని జోస్యం చెప్పారు. కొందరు స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని విమర్శించారు. అవసరం తీరాక పార్టీమారిన నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
కేసీఆర్, జగన్ కుట్రలు...
కులం పేరుతో కొందరు తెదేపాపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలని ఉద్ఘాటించారు. తెదేపాకు ప్రజల మద్దతు ఉందని గుర్తుచేశారు. తెదేపాను ఎదుర్కొనేందుకు కేసీఆర్, జగన్ హైదరాబాద్లో వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు.
వ్యక్తిగత నిర్ణయమే...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో మరొకరికి అవకాశం కల్పించడానికే రాజీనామా చేశానన్నారు. తెదేపాలో కుల మతాలకు ప్రాధాన్యం ఉండదని వివరించారు.