ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am

author img

By

Published : Nov 3, 2022, 9:02 AM IST

..

9am topnews
ప్రధానవార్తలు9am
  • తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. చింతకాయల రాజేశ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇచ్చి... ఆయనను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సామాన్యుల ఉసురు తీస్తున్న విద్యుత్​ శాఖ నిర్లక్ష్యం

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం.. సామాన్యుల ఉసురు తీస్తోంది. అనంతపురం జిల్లాలో విద్యుత్‌ తీగలు తెగిపడి కూలీలు మృతిచెందడం.. వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం.. నిర్లక్ష్యానికి అద్ధంపడుతోంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేను ఉన్నాను... అయినా నేను వినను

నేను ఉన్నాను... నేను విన్నాను.! పాదయాత్రలో జగన్‌ ఈ డైలాగ్‌ చెప్పని రోజంటూ లేదేమో.! కానీ అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌ అయింది. పాదయాత్రలో.. ఎదురుపడిన వాళ్లందరినీ తలపై చేయిపెట్టి మరీ ఆశీర్వదించిన జగన్‌... అధికారంలోకి వచ్చాక సామాన్యుల్ని కలవరు... వారి బాధలు వినరు..! ఏదైనా పర్యటన ఉంటే తప్ప.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటని జగన్‌..ఆ కాంపౌండ్‌ బయట పడిగాపులు కాసే బాధితుల మొర వినరు... కనరు.! అన్నా అంటూ వచ్చే వారి మొర ఆలకించరు.! ఆలకిస్తే.. రోజంతా తాడేపల్లి ఇంటి బయట పడిగాపులు కాసిన ఆరుద్రకు ఎందుకు అభయమివ్వలేకపోయారు..? నాడు జనంలోతిరిగిన జగన్‌ నేడు అదే జనాన్ని ఎందుకు కలవలేకపోతున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆరుద్ర వ్యవహారంపై స్పందించిన కాకినాడ ఎస్పీ ఆఫీస్​.. ఏమన్నారంటే..!

సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ అంశంపై కాకినాడ ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆరుద్ర, భువనేశ్వరరావు దంపతుల కుమార్తె లక్ష్మీ చంద్ర అనారోగ్యంతో బాధపడుతోందని.., వైద్యం కోసం అన్నవరంలో తమ ఇంటిని అమ్మేందుకు యత్నించగా కొందరు అడ్డుపడ్డారని ఎస్పీ కార్యాలయం పేర్యొంది. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదైనట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం'

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్​తో భేటీ అయ్యారు. ఈ భేటీలో స్టాలిన్​తో చర్చించిన విషయాలపై మమత క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న మరుగుజ్జు అజీమ్​.. ఆ విషయంలో మాత్రం..

పొట్టిగా ఉండటం వల్ల తనకు వివాహం కావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజీమ్​ మన్సూరీ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్నాడు. తనకు ఎంతగానో సహాయం చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు అందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇజ్రాయెల్‌ పీఠం మళ్లీ నెతన్యాహుదే!

బెంజమిన్‌ నెతన్యాహు​ మళ్లీ ఇజ్రాయెల్​ ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దిశగా నెతన్యాహు నేతృత్వంలోని కూటమి విజయానికి దగ్గరైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్టోబర్​లో దుమ్మురేపిన కార్ల అమ్మకాలు.. బైక్​ సేల్స్ డౌన్​!

పండుగ సీజన్​లో కార్ల అమ్మకం జోరుగా సాగింది. మధ్యస్థాయి కార్లతో స్పోర్ట్స్​ కార్లకు మరింత డిమాండ్​ పెరిగింది. అయితే ద్విచక్ర వాహనాల డిమాండ్​ మాత్రం కొంత మేరకు తగ్గిందని తయారీ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చివరి ఓవర్‌లో వారిద్దరే నా ఛాయిస్‌.. కానీ: రోహిత్‌ శర్మ

టీ20 ప్రపంచకప్‌ హోరా హోరీగా జరుగుతోంది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు తమ గెలుపోటములపై స్పందించారు. ఏమన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సినిమాలు ఆడకపోవచ్చు.. కానీ నటిగా ఓడిపోలేదు'

అనూ ఇమాన్యూయేల్​.. 'మజ్ను'తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన మరో చిత్రం 'ఊర్వశివో రాక్షసివో' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ విషయాలివే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెదేపా నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. చింతకాయల రాజేశ్‌ను కూడా అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇచ్చి... ఆయనను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సామాన్యుల ఉసురు తీస్తున్న విద్యుత్​ శాఖ నిర్లక్ష్యం

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం.. సామాన్యుల ఉసురు తీస్తోంది. అనంతపురం జిల్లాలో విద్యుత్‌ తీగలు తెగిపడి కూలీలు మృతిచెందడం.. వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం.. నిర్లక్ష్యానికి అద్ధంపడుతోంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేను ఉన్నాను... అయినా నేను వినను

నేను ఉన్నాను... నేను విన్నాను.! పాదయాత్రలో జగన్‌ ఈ డైలాగ్‌ చెప్పని రోజంటూ లేదేమో.! కానీ అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌ అయింది. పాదయాత్రలో.. ఎదురుపడిన వాళ్లందరినీ తలపై చేయిపెట్టి మరీ ఆశీర్వదించిన జగన్‌... అధికారంలోకి వచ్చాక సామాన్యుల్ని కలవరు... వారి బాధలు వినరు..! ఏదైనా పర్యటన ఉంటే తప్ప.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటని జగన్‌..ఆ కాంపౌండ్‌ బయట పడిగాపులు కాసే బాధితుల మొర వినరు... కనరు.! అన్నా అంటూ వచ్చే వారి మొర ఆలకించరు.! ఆలకిస్తే.. రోజంతా తాడేపల్లి ఇంటి బయట పడిగాపులు కాసిన ఆరుద్రకు ఎందుకు అభయమివ్వలేకపోయారు..? నాడు జనంలోతిరిగిన జగన్‌ నేడు అదే జనాన్ని ఎందుకు కలవలేకపోతున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆరుద్ర వ్యవహారంపై స్పందించిన కాకినాడ ఎస్పీ ఆఫీస్​.. ఏమన్నారంటే..!

సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ అంశంపై కాకినాడ ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆరుద్ర, భువనేశ్వరరావు దంపతుల కుమార్తె లక్ష్మీ చంద్ర అనారోగ్యంతో బాధపడుతోందని.., వైద్యం కోసం అన్నవరంలో తమ ఇంటిని అమ్మేందుకు యత్నించగా కొందరు అడ్డుపడ్డారని ఎస్పీ కార్యాలయం పేర్యొంది. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదైనట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం'

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్​తో భేటీ అయ్యారు. ఈ భేటీలో స్టాలిన్​తో చర్చించిన విషయాలపై మమత క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న మరుగుజ్జు అజీమ్​.. ఆ విషయంలో మాత్రం..

పొట్టిగా ఉండటం వల్ల తనకు వివాహం కావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజీమ్​ మన్సూరీ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్నాడు. తనకు ఎంతగానో సహాయం చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు అందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇజ్రాయెల్‌ పీఠం మళ్లీ నెతన్యాహుదే!

బెంజమిన్‌ నెతన్యాహు​ మళ్లీ ఇజ్రాయెల్​ ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దిశగా నెతన్యాహు నేతృత్వంలోని కూటమి విజయానికి దగ్గరైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్టోబర్​లో దుమ్మురేపిన కార్ల అమ్మకాలు.. బైక్​ సేల్స్ డౌన్​!

పండుగ సీజన్​లో కార్ల అమ్మకం జోరుగా సాగింది. మధ్యస్థాయి కార్లతో స్పోర్ట్స్​ కార్లకు మరింత డిమాండ్​ పెరిగింది. అయితే ద్విచక్ర వాహనాల డిమాండ్​ మాత్రం కొంత మేరకు తగ్గిందని తయారీ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చివరి ఓవర్‌లో వారిద్దరే నా ఛాయిస్‌.. కానీ: రోహిత్‌ శర్మ

టీ20 ప్రపంచకప్‌ హోరా హోరీగా జరుగుతోంది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు తమ గెలుపోటములపై స్పందించారు. ఏమన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సినిమాలు ఆడకపోవచ్చు.. కానీ నటిగా ఓడిపోలేదు'

అనూ ఇమాన్యూయేల్​.. 'మజ్ను'తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన మరో చిత్రం 'ఊర్వశివో రాక్షసివో' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ విషయాలివే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.