బాపట్ల ఎంపీ నందిగామ సురేష్పై తెదేపా నాయకులు దాడిని ఖండిస్తూ రాయదుర్గం పట్టణంలో వైకాపా నాయకులు రాస్తారోకో చేశారు. తెదేపా దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే వైకాపా నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెదేపాకు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రాయదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారిలో గంటపాటు రాస్తారోకో చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాకపోకలు ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇవీ చదవండి...'ప్రజల భాషలోనే ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి'