ETV Bharat / state

తెదేపా నాయకుడి ఇంటిచుట్టూ.. బండలు పాతిన వైకాపా వర్గీయులు

అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నాయకుల ఇళ్ల చుట్టూ వైకాపా మద్దతుదారులు బండలు పాతారు. వాటిని తొలగించేందుకు తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

author img

By

Published : Oct 27, 2019, 11:58 AM IST

Updated : Oct 27, 2019, 1:00 PM IST

తెదేపా నాయకుల ఇళ్ల చుట్టూ బండలు
తెదేపా నాయకుడి ఇంటి చుట్టూ.. బండలు పాతిన వైకాపా వర్గీయులు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఏర్పడిన వివాదం ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు నాగరాజు, వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి మధ్య స్థల వివాదం ఉంది. ఈ విషయమై గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా.. పెద్దిరెడ్డి దౌర్జన్యంగా నాగరాజు ఇంటికి అడ్డుగా బండలు పాతాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తమ పార్టీ నాయకుడి స్థలం కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారంటూ తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని... బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

తెదేపా నాయకుడి ఇంటి చుట్టూ.. బండలు పాతిన వైకాపా వర్గీయులు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఏర్పడిన వివాదం ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు నాగరాజు, వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి మధ్య స్థల వివాదం ఉంది. ఈ విషయమై గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా.. పెద్దిరెడ్డి దౌర్జన్యంగా నాగరాజు ఇంటికి అడ్డుగా బండలు పాతాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తమ పార్టీ నాయకుడి స్థలం కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారంటూ తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని... బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Intro:వెంకటాపురం గ్రామంలో పోలీస్ బందోబస్తు ...


టీడీపీ వర్గానికి చెందిన వారి ఇంటికి వైయసార్ సీపీ వర్గీయులు దౌర్జన్యం ..

టీడీపీ వర్గానికి చెందిన ఇంటికి అడ్డంగా బండలు నాటిన వైయస్సార్ సీపీ వర్గీయులు ..

టీడీపీ నాయకులు వచ్చి బండలు తొలగిస్టరాని రెండు వర్గాల మద్య వాగ్వాదం జరుగుతదని ముందస్తుగ పోలీస్ బందోబస్తు...


Body:శింగనమల


Conclusion:కాంట్రిబ్యుటర్
Last Updated : Oct 27, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.