ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు

author img

By

Published : Apr 26, 2020, 11:43 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పగటిపూట రోడ్డుపై వాహనాలను అనుమతించకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అదే వారికి ఆఖరి ప్రయాణం అయ్యింది. ఆరు నెలల చిన్నారికి తల్లి లేకుండా పోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి తల్లి మృతి చెందగా... తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

women died and two people are injured in a road accident at ananthapuram
women died and two people are injured in a road accident at ananthapuram

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వజ్రకరూర్ మండలం బోడసానిపల్లి గ్రామానికి చెందిన వర్లీ భాయి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త కేశవ నాయక్​తో పాటు ఆరు నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వజ్రకరూర్ మండలం బోడసానిపల్లి గ్రామానికి చెందిన వర్లీ భాయి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త కేశవ నాయక్​తో పాటు ఆరు నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నిబంధనలు పాటించాలన్నందుకు.. గ్రామ వాలంటీర్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.