రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు ఎన్ని అరాచకాలు సృష్టించినా... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరుతామని మాజీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిని బలపరిచేందుకు జడ్పీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైకాపా నేతలు తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోనూ తెదేపా అభ్యర్థులు కనీసం నామినేషన్ వేసేందుకు రానివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఇలా చేస్తే... ఎన్నికల్లో గెలిచేది తెదేపానే అని గుర్తుంచుకోవాలని సునీత హెచ్చరించారు.
ఇదీ చదవండి: