ETV Bharat / state

వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు: పరిటాల సునీత

author img

By

Published : Mar 7, 2021, 12:12 PM IST

పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పరిటాల సునీత ఆరోపించారు.

Volunteers are influencing voters
వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు :మాజీ మంత్రి పరిటాల సునీత

వార్డుల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరిస్తూ.. ఓటర్ స్లిప్​లు పంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం గుట్టకింద కాలనీలో అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం చేశారు.

అక్కడ ప్రచారం చేస్తున్న ఓ వార్డు వాలంటీర్​ను నిలదీశారు. వాలంటీర్ అయివుండి.. ఓటర్ స్లిప్​లు ఎలా పంచుతావని అడగటంతో సదరు వ్యక్తి అక్కడినుంచి జారుకునే యత్నం చేశారు. వాలంటీర్లు వైకాపాకే ఓటు వేయాలని ఓటర్లను బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు.

వార్డుల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరిస్తూ.. ఓటర్ స్లిప్​లు పంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం గుట్టకింద కాలనీలో అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం చేశారు.

అక్కడ ప్రచారం చేస్తున్న ఓ వార్డు వాలంటీర్​ను నిలదీశారు. వాలంటీర్ అయివుండి.. ఓటర్ స్లిప్​లు ఎలా పంచుతావని అడగటంతో సదరు వ్యక్తి అక్కడినుంచి జారుకునే యత్నం చేశారు. వాలంటీర్లు వైకాపాకే ఓటు వేయాలని ఓటర్లను బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు.

ఇదీ చూడండి:

చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.