ETV Bharat / state

'సాంప్రదాయంగా వస్తున్న పండుగను చేసుకోనివ్వండి'

author img

By

Published : Mar 22, 2021, 4:33 PM IST

అనంతపురంలోని దేవాదాయశాఖ కార్యాలయం వద్ద వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన చేశారు. చీలేవారిపల్లి శ్రీకాటికోటేశ్వరస్వామి ఆలయ వివాదానికి సంబంధించి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.

'సాంప్రదాయంగా వస్తున్న పండుగను జరుపుకొనివ్వండి'
'సాంప్రదాయంగా వస్తున్న పండుగను జరుపుకొనివ్వండి'

అనంతపురం జిల్లా చీలేవారిపల్లి శ్రీకాటికోటేశ్వరస్వామి ఆలయ వివాదానికి సంబంధించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని దేవాదాయశాఖ కార్యాలయం వద్ద ఆ గ్రామ ప్రజలతో కలిసి వారు ధర్నా చేపట్టారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున ఆలయ ఉత్సవాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈసారి ధర్మవరం ఎమ్మెల్యే అనవసరంగా జోక్యం చేసుకొని తమను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. సాంప్రదాయంగా వస్తున్న పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా చీలేవారిపల్లి శ్రీకాటికోటేశ్వరస్వామి ఆలయ వివాదానికి సంబంధించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని దేవాదాయశాఖ కార్యాలయం వద్ద ఆ గ్రామ ప్రజలతో కలిసి వారు ధర్నా చేపట్టారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున ఆలయ ఉత్సవాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈసారి ధర్మవరం ఎమ్మెల్యే అనవసరంగా జోక్యం చేసుకొని తమను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. సాంప్రదాయంగా వస్తున్న పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.