ETV Bharat / state

అదును చూసి చోరీ.. నగదు, ఆభరణాలు మాయం

author img

By

Published : Sep 30, 2020, 10:15 PM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం బెస్తవాడలో చోరీ జరిగింది. రూ. 1 లక్ష 50 వేల నగదు, ఒక జత కమ్మలు, 13 తులాల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు.

theft at gutti
గుత్తి పట్టణంలో చోరీ

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బెస్త వాడలో చోరీ జరిగింది. శంకరయ్య, లక్ష్మీదేవి దంపతులు ఉదయం పనిమీద ఇంటికి తాళం వేసి పక్క ఊరికి వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.

లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ. 1 లక్ష 50 వేల నగదు, ఒక జత కమ్మలు, 13 తులాల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి. పోలీసులకు సమాచారం అందించడంతో... వారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బెస్త వాడలో చోరీ జరిగింది. శంకరయ్య, లక్ష్మీదేవి దంపతులు ఉదయం పనిమీద ఇంటికి తాళం వేసి పక్క ఊరికి వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.

లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ. 1 లక్ష 50 వేల నగదు, ఒక జత కమ్మలు, 13 తులాల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి. పోలీసులకు సమాచారం అందించడంతో... వారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

'పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.