అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మాలవీధిలో నివాసం ఉంటున్న రవి అనే వ్యక్తి తమ ఇంటి వెనుకవైపు నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని లక్ష రూపాయల నగదు.. 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూడగానే... బీరువాలోని బట్టలు చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి