ETV Bharat / state

భిక్షాటనతో వచ్చిన డబ్బులను... వరద బాధితులకు అందజేత

వరదలతో నష్టపోయిన వారికి ఎమ్మెల్యే సాయం అందించారు. స్వయంగా ఆయనే భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను బాధితులకు అందజేశారు.

author img

By

Published : Oct 8, 2019, 8:41 AM IST

ఎమ్మెల్యే
వరద బాధితులకు సాయం

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో రెండుసార్లు వరదలతో నష్టపోయిన భాదితులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగదు పంపిణీ చేశారు. పిన్నెపల్లి పాత చెరువు తెగి గత నెల 24న, ఈ నెల 3న యాడికి మండల కేంద్రంలోని లాలేప్ప కాలనీ, అంబేడ్కర్‌ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, చెన్నకేశవ కాలనీ, ఆసుపత్రి కాలనీ, టీచర్స్ కాలనీలతోపాటు రెడ్ల గుడిసెలు, పిన్నెపల్లి గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు ఎమ్మెల్యే గత నెల 28న తాడిపత్రి పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమానికి కులసంఘాలు, కర్మాగారాలు, కళాశాలలు, వ్యాపారుల వద్ద నుంచి దాదాపు రూ.40 లక్షలు వచ్చింది. ఈ నగదును చేనేత కుటుంబానికి రూ.8 వేలు, సామాన్యు కుటుంబానికి రూ.3 వేలు నగదు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని హామీ ఇచ్చారు.

వరద బాధితులకు సాయం

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో రెండుసార్లు వరదలతో నష్టపోయిన భాదితులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగదు పంపిణీ చేశారు. పిన్నెపల్లి పాత చెరువు తెగి గత నెల 24న, ఈ నెల 3న యాడికి మండల కేంద్రంలోని లాలేప్ప కాలనీ, అంబేడ్కర్‌ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, చెన్నకేశవ కాలనీ, ఆసుపత్రి కాలనీ, టీచర్స్ కాలనీలతోపాటు రెడ్ల గుడిసెలు, పిన్నెపల్లి గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు ఎమ్మెల్యే గత నెల 28న తాడిపత్రి పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమానికి కులసంఘాలు, కర్మాగారాలు, కళాశాలలు, వ్యాపారుల వద్ద నుంచి దాదాపు రూ.40 లక్షలు వచ్చింది. ఈ నగదును చేనేత కుటుంబానికి రూ.8 వేలు, సామాన్యు కుటుంబానికి రూ.3 వేలు నగదు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని హామీ ఇచ్చారు.

Intro:ap_cdp_19_07_dasara_uchavalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటివి కంప్యూటర్, కడప.

యాంకర్:
దసరా ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కడప అమ్మవారి శాల లో వాసవి మాత భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి విగ్రహాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. పూల పందిరి తో ఆలయమంతా చూడముచ్చటగా ఉంది. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. విజయ దుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి భారీ ఎత్తున అమ్మవారి విగ్రహాలతో ఊరేగింపు కార్యక్రమం తో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.


Body:దసరా ఉత్సవాలు


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.