ETV Bharat / state

''అన్నా క్యాంటీన్లు తెరవండి.. పేదల ఆకలి తీర్చండి''

రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలంటూ... అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా కార్యకర్తలు ధర్నా చేశారు.

author img

By

Published : Aug 3, 2019, 6:59 PM IST

అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి తీర్చండి
అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి తీర్చండి

అనంతపురం జిల్లా మడకశిరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని మూతపడిన క్యాంటీన్ల ముందర తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లతో 5 రూపాయల నాణెంతో శబ్దం చేస్తూ.... మూతపడిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నినాదాలు చేశారు. 15 రూపాయలకే 3 పూటల భోజన పథకాన్ని మాజీ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేసి ఉపాధి కోసం పట్టణానికి వచ్చి పని చేసుకునే వారి కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదర్శనగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయంలో అర్జీ ఇచ్చారు.

అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి తీర్చండి

అనంతపురం జిల్లా మడకశిరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని మూతపడిన క్యాంటీన్ల ముందర తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లతో 5 రూపాయల నాణెంతో శబ్దం చేస్తూ.... మూతపడిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నినాదాలు చేశారు. 15 రూపాయలకే 3 పూటల భోజన పథకాన్ని మాజీ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేసి ఉపాధి కోసం పట్టణానికి వచ్చి పని చేసుకునే వారి కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదర్శనగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయంలో అర్జీ ఇచ్చారు.

ఇది చూడండి:

జగన్ గారూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా?: లోకేష్

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_Atp_46_19_Narasimhudi_Mallepula_Ustvam_AV_C8


Body:అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామికి మల్లెపూల ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవాల మండపంలో స్వామివారిని మల్లె పూలతో శోభాయ అనగా అలంకరించారు. ఉభయ సతుల మధ్య కొలువైన ఉత్సవాల దేవుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పల్లకిలో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకోవడానికి తిరువీధుల్లో పెద్ద సంఖ్యలో బారులుతీరారు. భక్త కోటిని దర్శనమిస్తూ స్వామి వారు ఆలయానికి పడమర ఉన్న మల్లెపూల మంటపానికి చేరుకున్నారు. మండపంలో ప్రధాన అర్చకుడు నరసింహాచార్యులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.