మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ