ETV Bharat / state

మన జవానుని మనమే గౌరవించుకోవాలి కదా సార్....!

పోలీసులన్నా, జవానులన్నా మనం చాలా గౌరవిస్తాం...ఎందుకంటే మన ప్రాణానికి వారి ప్రాణాలు పణంగా పెడతారు కాబట్టి. మరి.. అలాంటి సిపాయి చనిపోతే... కడసారి గౌరవ వందనం కచ్చితంగా చేస్తాం. కానీ.. అనతంపురానికి చెందిన జవాను తిప్పేష్ చనిపోతే.. అక్కడి పోలీసులు కనీసం చూడటానికి కూడా రాకపోవడం విచారకరమో.. నిర్లక్ష్యమో వారికే తెలియాలి.

author img

By

Published : Jul 13, 2019, 11:30 PM IST

సిపాయికి దక్కని గౌరవవందనం
సిపాయికి దక్కని గౌరవవందనం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సిపాయి తిప్పేష్ ఒరిస్సాలో మృతిచెందగా... మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఇలాంటి సందర్భంలో.. బాధిత కుటుంబాన్ని అధికార, పాలక వర్గాలెవరూ పట్టించుకోలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవానుకు సంతాపమూ తెలపలేదు. దేశ సిపాయిగా పని చేసిన వ్యక్తి.. మృతి చెందితే కనీసం పరామర్శించడానికీ ఎవరూ రాలేదని కుటుంబం కుంగిపోతోంది. సిపాయి శవాన్ని దహనం చేయకుండానే ధర్నాకు దిగింది. తమకు రావల్సిన ప్రయోజనాల గురించి అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా చూసిన వాళ్లు... మన సిపాయిని మనమే గౌరవించుకోకపోతే ఎలా సార్.. కొంచెం ఆలోచించండి.. అంటున్నారు.

ఇదీ చూడండి:'విద్యుత్‌ కాటుకు తల్లీ, కుమార్తె బలి'

సిపాయికి దక్కని గౌరవవందనం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సిపాయి తిప్పేష్ ఒరిస్సాలో మృతిచెందగా... మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఇలాంటి సందర్భంలో.. బాధిత కుటుంబాన్ని అధికార, పాలక వర్గాలెవరూ పట్టించుకోలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవానుకు సంతాపమూ తెలపలేదు. దేశ సిపాయిగా పని చేసిన వ్యక్తి.. మృతి చెందితే కనీసం పరామర్శించడానికీ ఎవరూ రాలేదని కుటుంబం కుంగిపోతోంది. సిపాయి శవాన్ని దహనం చేయకుండానే ధర్నాకు దిగింది. తమకు రావల్సిన ప్రయోజనాల గురించి అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా చూసిన వాళ్లు... మన సిపాయిని మనమే గౌరవించుకోకపోతే ఎలా సార్.. కొంచెం ఆలోచించండి.. అంటున్నారు.

ఇదీ చూడండి:'విద్యుత్‌ కాటుకు తల్లీ, కుమార్తె బలి'

Intro:గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దైద అమరలింగేశ్వర స్వామి ని మరియు పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ బిలం లోని చీకటి మల్లయ్యను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.


Body:నల్లమల అడవులు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉన్నటువంటి గుత్తికొండ బిలం. ఏకాదశిని పురస్కరించుకొని చీకటి మల్లయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. శివనామస్మరణతో మారుమోగిపోయింది.


Conclusion:గుహల్లోని కొలను లో భక్తులు స్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుచున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు మరియు పోలీస్ సిబ్బంది వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దగ్గర ఉండి వారు పర్యవేక్షిస్తున్నారు.

గుంటూరు జిల్లా నుండి సైదాచారి etv bharat గుత్తికొండ బిలం.9949449423.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.