ETV Bharat / state

మరింత నష్టాల్లోకి నెట్టిన సిగటోక తెగులు.. - banana farmers affected in ananthapur

అనంతపురం జిల్లాలో అధిక వర్షాల దుష్పలితాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్​లో కురిసిన వర్షాల కారణంగా ప్రస్తుతం అరటి రైతులు తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తోంది. దశాబ్దంన్నర క్రితం జిల్లాను వీడిందనుకన్న సిగటోక తెగులు.. రైతులకు నిద్రలేకుండా చేస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో ఆకుమచ్చ ఏర్పడి, దాని ప్రభావంతో అరటి పండ్లు చెట్టుమీదే మాగిపోతున్నాయి. ఈ తెగులు సోకిన తోటలవైపు వ్యాపారులు కన్నెత్తి కూడా చూడటంలేదు. అరటి ధర పడిపోయి.. నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

sigatoka rot is affected to banana farms and farmers are suffering a lot with the affect at ananthapur district
మరింత నష్టాల్లోకి నెట్టిన సిగటోక తెగులు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు
author img

By

Published : Jan 25, 2021, 4:17 PM IST

మరింత నష్టాల్లోకి నెట్టిన సిగటోక తెగులు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు

అనంతపురం జిల్లాలో 13వేల హెక్టార్లలో రైతులు అరటి సాగు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పంట చేతికొస్తుంది. గతేడాది సెప్టెంబర్​లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టం తేరుకోకముందే అరటి పంటపై సిగటోగ తెగులు విజృంభించింది. సిగటోగ తెగులు సోకడంతో అరటి పండ్లన్నీ చెట్లపైనే మాగిపోతున్నాయి.

ప్రస్తుతం టన్ను అరటి గెలల ధర రూ.10 నుంచి 11వేల వరకు ఉండగా.. ఈ తెగులు సోకిన గెలలను రూ.3వేలకు కూడా వ్యాపారులు కొనటం లేదు. కొనేవాళ్లు లేక పంట తోటలోనే కుళ్లిపోతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఫ్రూట్స్​ కంపెనీ కుడా.. రైతుల నుంచి అరటిని కొనుగోలు చేయటం లేదు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని.. వ్యాపారులు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు.

వర్షాల కారణంగానే పండ్లు మాగిపోతున్నాయి

అధిక వర్షాల కారణంగానే.. సిగటోగా తెగులు వచ్చిందని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ఆ తెగులు వల్లే అరటి పండ్లు మాగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

సిగటోక తెగులు సోకిన పండ్లను స్థానిక మార్కెట్లో అయినా విక్రయిస్తే.. రైతులకు కొంతవరకైనా నష్టం తగ్గుతోంది. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మట్టి పాత్రల తయారీకి ‘కుంభార్‌ సశక్తీకరణ’.. తెలంగాణ వ్యాప్తంగా శిక్షణ

మరింత నష్టాల్లోకి నెట్టిన సిగటోక తెగులు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు

అనంతపురం జిల్లాలో 13వేల హెక్టార్లలో రైతులు అరటి సాగు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పంట చేతికొస్తుంది. గతేడాది సెప్టెంబర్​లో కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టం తేరుకోకముందే అరటి పంటపై సిగటోగ తెగులు విజృంభించింది. సిగటోగ తెగులు సోకడంతో అరటి పండ్లన్నీ చెట్లపైనే మాగిపోతున్నాయి.

ప్రస్తుతం టన్ను అరటి గెలల ధర రూ.10 నుంచి 11వేల వరకు ఉండగా.. ఈ తెగులు సోకిన గెలలను రూ.3వేలకు కూడా వ్యాపారులు కొనటం లేదు. కొనేవాళ్లు లేక పంట తోటలోనే కుళ్లిపోతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఫ్రూట్స్​ కంపెనీ కుడా.. రైతుల నుంచి అరటిని కొనుగోలు చేయటం లేదు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని.. వ్యాపారులు చాలా తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు.

వర్షాల కారణంగానే పండ్లు మాగిపోతున్నాయి

అధిక వర్షాల కారణంగానే.. సిగటోగా తెగులు వచ్చిందని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ఆ తెగులు వల్లే అరటి పండ్లు మాగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

సిగటోక తెగులు సోకిన పండ్లను స్థానిక మార్కెట్లో అయినా విక్రయిస్తే.. రైతులకు కొంతవరకైనా నష్టం తగ్గుతోంది. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మట్టి పాత్రల తయారీకి ‘కుంభార్‌ సశక్తీకరణ’.. తెలంగాణ వ్యాప్తంగా శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.