ETV Bharat / state

రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందజేస్తాం

అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీని బీసీ సంక్షేమ మంత్రి శంకర నారాయణ ప్రారంభించారు. రైతుంలందరికీ సకాలంలో విత్తనాలు అందిస్తామని చెప్పారు.

author img

By

Published : Jun 15, 2019, 5:58 PM IST

Updated : Jun 15, 2019, 11:28 PM IST

విత్తన పంపిణీ
రైతులందరికీ సకాలంలో విత్తనాలిస్తాం

రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందిస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీ సంక్షేమ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉందని.. అందుకే రైతు భరోసా కింద 12వేల500 అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతీ రైతుకు బోరు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. వేరుశనగ పంట పండకపోయినా ఆందోళన చెందవద్దని.. వైఎస్ఆర్ ప్రభుత్వం తరహాలోనే ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనం నాణ్యత లేకపోతే వెంటనే తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

రైతులందరికీ సకాలంలో విత్తనాలిస్తాం

రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందిస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీ సంక్షేమ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉందని.. అందుకే రైతు భరోసా కింద 12వేల500 అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతీ రైతుకు బోరు వేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. వేరుశనగ పంట పండకపోయినా ఆందోళన చెందవద్దని.. వైఎస్ఆర్ ప్రభుత్వం తరహాలోనే ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనం నాణ్యత లేకపోతే వెంటనే తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి.

'సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదే'

Intro:Ap_vsp_46_15_prapancha_vruddula_vedimpula_nivaeana_dinotsavam_sadassu_ab_c4
పిల్లల్ని ఎన్నో ఆశలతో పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆదరణ కరువవుతోంది వయసు మీరిన తల్లిదండ్రులను చిన్నచూపు చూసే వారి సంఖ్య పెరుగుతుండడంతో వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు కుమార్తె కుమారులు పై ఎన్నో ఆశలు పెట్టుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేస్తే వయసు మీరిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సంతానం వయస్సు మీరిన వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మానవతా విలువలు దిగజారుతున్న తరుణంలో వృద్ధులపై వేధింపులను నివారించేలా సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవంలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి లో వృద్ధుల వేధింపుల నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు


Body:కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ న్యాయవాది శివయ్య మాట్లాడుతూ వృద్ధులపై వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అన్నారు ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వారు ప్రయోజకులు అయ్యాక వయసు మీరిన తల్లిదండ్రులను పట్టించుకోని సంఘటనలు పెరిగిపోతున్నాయి అన్నారు ఇలాంటి తరుణంలో వృద్ధుల పై జరుగుతున్న వేధింపులను నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వృద్ధులను ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు వృద్ధులను పట్టించుకోని పిల్లలపై సి ఆర్ పి ఎస్ 125 ప్రకారం చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు వివరించారు 2007లో ప్రవేశపెట్టిన వృద్ధుల సంక్షేమ చట్టాన్ని ఇక్కడికి విచ్చేసిన వృద్ధులకు తెలిపారు దీనిపై ప్రచారం చేసేలా అనకాపల్లి సీనియర్ సిటిజెన్ సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలని వివరించారు కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు సూరి నాయుడు ప్రధాన కార్యదర్శి నున్నా వీరభద్ర రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సూర్యనారాయణ శాస్త్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్స్ ని సత్కరించారు


Conclusion:బైట్1 శివయ్య సినియర్ న్యాయవాది అనకాపల్లి
Last Updated : Jun 15, 2019, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.