ETV Bharat / state

ROAD ACCIDENT: తుంపర్తి వద్ద ఆటో బోల్తా.. రైతు మృతి

author img

By

Published : Dec 29, 2021, 9:21 AM IST

ROAD ACCIDENT: అనంతపురం జిల్లాలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తుంపర్తి వద్ద ఆటో బోల్తా
తుంపర్తి వద్ద ఆటో బోల్తా


ROAD ACCIDENT: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి వద్ద ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ మృతి చెందాడు. మరో రైతు ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. మేడాపురం నుంచి ధర్మవరం కూరగాయల మార్కెట్​కు ఆటోలో కూరగాయలు తీసుకువస్తుండగా పొగమంచుతో రహదారి కనిపించకపోవడంతో ఆటో అదుపుతప్పి కిందపడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ధర్మవరం గ్రామీణ పోలీసులు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ROAD ACCIDENT: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి వద్ద ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ మృతి చెందాడు. మరో రైతు ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. మేడాపురం నుంచి ధర్మవరం కూరగాయల మార్కెట్​కు ఆటోలో కూరగాయలు తీసుకువస్తుండగా పొగమంచుతో రహదారి కనిపించకపోవడంతో ఆటో అదుపుతప్పి కిందపడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ధర్మవరం గ్రామీణ పోలీసులు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి:

Sun Pharma: రాష్ట్రంలో సన్​ ఫార్మా ప్లాంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.