ETV Bharat / state

పనులు ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Dec 3, 2020, 7:19 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

injured people
చికిత్స పొందుతున్న గాయపడిన వ్యక్తులు

అనంతపురం జిల్లాలోని తడకలపల్లి గ్రామ సమీపంలో ఆటో, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హిందూపురం హాస్పిటల్​కి తీసుకెళ్లారు.

ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా మడకశిర మండలానికి చెందిన వారు. వీరంతా ఉపాధి కోసం హిందూపురం సమీపంలో గల గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్లి పనులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలోని తడకలపల్లి గ్రామ సమీపంలో ఆటో, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హిందూపురం హాస్పిటల్​కి తీసుకెళ్లారు.

ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా మడకశిర మండలానికి చెందిన వారు. వీరంతా ఉపాధి కోసం హిందూపురం సమీపంలో గల గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్లి పనులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.