అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో ద్విచక్రవాహనాన్ని బోలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేంద్ర(25) చందు(21) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. కర్ణాటక పావగడకి చెందిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నరేంద్ర, చందు అక్కడికక్కడే మరణించగా.... ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు.
ఇదీ చూడండి. 'ఇలాంటి కీలక సమయంలో అలసత్వం వద్దు'