అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పామిడి పట్టణానికి చెందిన రాజన్న కుటుంబ సమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి.. డ్రైవర్ బ్రేకులు వేయటంతో వేగంగా ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఒక వైపునకు ఓరిగి బోల్తాపడింది. ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రక్తమోడిన రహదారులు.. కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి