ETV Bharat / state

పేకాట స్థావరాలపై దాడులు​.. 3 లక్షల నగదు స్వాధీనం

author img

By

Published : Mar 17, 2020, 2:50 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు పోలీసులు.. పేకాట స్థావరాలపై దాడులు చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.07 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ananthapuram police
అనంతపురంలో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు
అనంతపురంలో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు - కర్నూలు జిల్లా గుమ్మనూరు గ్రామాల మధ్యలో పేకాట నిర్వహిస్తున్న స్థావరాలపై ఉరవకొండ, విడపనకల్లు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3,07,500 రూపాయలు నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని ఉరవకొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఇ. వెంకటస్వామి తెలిపారు. పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతపురంలో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు - కర్నూలు జిల్లా గుమ్మనూరు గ్రామాల మధ్యలో పేకాట నిర్వహిస్తున్న స్థావరాలపై ఉరవకొండ, విడపనకల్లు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3,07,500 రూపాయలు నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని ఉరవకొండ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఇ. వెంకటస్వామి తెలిపారు. పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చూడండి...

వైకాపా ఎమ్మెల్యేకు ఈసీ షాక్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.