అనంతపురం జిల్లా హిందూపురం లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమితులైన బీకే పార్థసారథికి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. పార్థసారథిని పూలమాలలతో సన్మానించారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులు..
ప్రస్తుత వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి.. బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో ఎన్నో పరిశ్రమలు వస్తే.. జగన్ సర్కార్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
వారు సిద్ధంగా ఉన్నారు..
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే వైకాపాకు బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: తెదేపా ఎమ్మెల్యే