ETV Bharat / state

వాలంటీర్ కళ్లలో కారం కొట్టి పింఛను డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు

వాలంటీర్ నుంచి పింఛను డబ్బులు దుండగులు దోచుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Oct 1, 2020, 9:18 AM IST

pention money stolen by thieves in madakasira ananthapuram district
వాలంటీర్ కళ్లలో కారం కొట్టి పింఛను డబ్బు తీసుకెళ్లిన దొంగలు

వాలంటీర్ నుంచి పింఛన్ డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అనంతపురం జిల్లా మడకశిరలోని మూడో వార్డు వాలంటీరుగా ఈరప్ప అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఆసరా పింఛన్ పంపిణీ చేసేందుకు రూ. 43వేల రూపాయలు తీసుకెళుతున్నాడు. దారిమధ్యలో నలుగురు వ్యక్తులు తన కళ్లల్లో కారం కొట్టి నగదు తీసుకెళ్లారని ఈరప్ప తెలిపాడు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

వాలంటీర్ నుంచి పింఛన్ డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అనంతపురం జిల్లా మడకశిరలోని మూడో వార్డు వాలంటీరుగా ఈరప్ప అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఆసరా పింఛన్ పంపిణీ చేసేందుకు రూ. 43వేల రూపాయలు తీసుకెళుతున్నాడు. దారిమధ్యలో నలుగురు వ్యక్తులు తన కళ్లల్లో కారం కొట్టి నగదు తీసుకెళ్లారని ఈరప్ప తెలిపాడు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

కర్నూలు జిల్లాలో భారీ వర్షం... పొంగుతున్న వాగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.