ETV Bharat / state

ఊపిరి ఇవ్వని వెంటిలేటర్లు.. రోగులకు తప్పని అవస్థలు! - useless ventilators in anantapur govt hospital

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లు లేక రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అయినవాళ్లను ఎలాగైనా బతికించుకోవాలని రాష్ట్రాల సరిహద్దులు దాటి.. వెంటిలేటర్ పడక ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కొవిడ్ రోగుల ప్రాణాలు నిలపటంలో ఎంతో ఉపయోగకరమైన వెంటిలేటర్లు.. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరుపయోగంగా పడి ఉన్నాయి.

useless ventilators in anantapur govt hospital
useless ventilators in anantapur govt hospital
author img

By

Published : May 15, 2021, 4:18 AM IST

ఊపిరి ఇవ్వని వెంటిలేటర్లు.. రోగులకు తప్పని అవస్థలు!

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల అధికారుల నిర్లక్ష్యం.. కరోనా బాధితులకు శాపంగా మారుతోంది. కొవిడ్ రోగుల చికిత్సకు సంజీవినిలా భావించే విలువైన వెంటిలేటర్లను.. వినియోగించకుండా పక్కన పడేశారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 70 వెంటిలేటర్లు ఉండగా.. ఒక్కటి మాత్రమే వాడుతున్నారు. మిగిలిన 69 వెంటిలేటర్లు సీల్డ్ బాక్సుల నుంచి బయటికి కూడా తీయలేదు. కదిరి ఆస్పత్రిలో వంద పడకలుంటే.. అక్కడ ఒక్క వెంటిలేటర్ కూడా లేదు. దీనివల్ల పరిస్థితి తీవ్రంగా ఉన్న కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 87 వెంటిలేటర్లు ఉండగా.. కేవలం మూడు మాత్రమే వాడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగు వెంటిలేటర్లు ఆసుపత్రికి విరాళం ఇవ్వగా.. వాటిని పెట్టెల్లో నుంచి కూడా తీయలేదు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నామని.. అవసరం మేరకే వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఎంతో విలువైన వెంటిలేటర్లను వాడకంలోకి తెచ్చి.. కరోనా రోగుల ప్రాణాలను కాపాడాలని బాధిత బంధువులు కోరుతున్నారు.


ఇదీ చదవండి

ఎంపీ రఘురామ అరెస్ట్: హౌస్‌మోషన్ పిటిషన్​పై ఇవాళ విచారణ

ఊపిరి ఇవ్వని వెంటిలేటర్లు.. రోగులకు తప్పని అవస్థలు!

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల అధికారుల నిర్లక్ష్యం.. కరోనా బాధితులకు శాపంగా మారుతోంది. కొవిడ్ రోగుల చికిత్సకు సంజీవినిలా భావించే విలువైన వెంటిలేటర్లను.. వినియోగించకుండా పక్కన పడేశారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 70 వెంటిలేటర్లు ఉండగా.. ఒక్కటి మాత్రమే వాడుతున్నారు. మిగిలిన 69 వెంటిలేటర్లు సీల్డ్ బాక్సుల నుంచి బయటికి కూడా తీయలేదు. కదిరి ఆస్పత్రిలో వంద పడకలుంటే.. అక్కడ ఒక్క వెంటిలేటర్ కూడా లేదు. దీనివల్ల పరిస్థితి తీవ్రంగా ఉన్న కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 87 వెంటిలేటర్లు ఉండగా.. కేవలం మూడు మాత్రమే వాడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగు వెంటిలేటర్లు ఆసుపత్రికి విరాళం ఇవ్వగా.. వాటిని పెట్టెల్లో నుంచి కూడా తీయలేదు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నామని.. అవసరం మేరకే వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఎంతో విలువైన వెంటిలేటర్లను వాడకంలోకి తెచ్చి.. కరోనా రోగుల ప్రాణాలను కాపాడాలని బాధిత బంధువులు కోరుతున్నారు.


ఇదీ చదవండి

ఎంపీ రఘురామ అరెస్ట్: హౌస్‌మోషన్ పిటిషన్​పై ఇవాళ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.