ETV Bharat / state

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: మంత్రి శంకరనారాయణ

author img

By

Published : Oct 30, 2020, 8:47 PM IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా గుట్టూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

shankar narayana
అర్హులందరికి సంక్షేమ పథకాలు చేరాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని మంత్రి శంకరనారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆయా శాఖల మండల అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామస్థుల సమస్యలపై చర్చించిన మంత్రి.... వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో శివశంకరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని మంత్రి శంకరనారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆయా శాఖల మండల అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామస్థుల సమస్యలపై చర్చించిన మంత్రి.... వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో శివశంకరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

స్టీలు పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.