ETV Bharat / state

'స్పష్టమైన ప్రణాళికతో అనంతపురాన్ని అభివృద్ధి చేస్తాం'

author img

By

Published : Nov 12, 2019, 1:55 PM IST

అనంతపురం జిల్లాలోని పలు కాలనీల్లో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్పష్టమైన ప్రణాళికతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాడిపత్రిలో వివాదాస్పదంగా మారిన గాయత్రీ దేవి ఆలయంపై స్పందించిన ఆయన స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

minister-bosta-visit-ananthapuram-district
'స్పష్టమైన ప్రణాళికతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం'

సమస్యల వలయంగా ఉన్న అనంతపురం కార్పొరేషన్​ను ఒక స్పష్టమైన ప్రణాళికతో అభివృద్ధి చేయడం సహా సుందరీకరణ చేస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన.. కాలనీల్లో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రిలో వివాదాస్పదంగా మారిన గాయత్రీ దేవి ఆలయంపై మంత్రి బొత్స స్పందించారు. ఆలయాన్ని దేవాదాయ లేదా పురపాలక శాఖ స్వాధీనం చేసుకుంటుందన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆలయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

'స్పష్టమైన ప్రణాళికతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం'

సమస్యల వలయంగా ఉన్న అనంతపురం కార్పొరేషన్​ను ఒక స్పష్టమైన ప్రణాళికతో అభివృద్ధి చేయడం సహా సుందరీకరణ చేస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయన.. కాలనీల్లో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రిలో వివాదాస్పదంగా మారిన గాయత్రీ దేవి ఆలయంపై మంత్రి బొత్స స్పందించారు. ఆలయాన్ని దేవాదాయ లేదా పురపాలక శాఖ స్వాధీనం చేసుకుంటుందన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆలయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ప్రపంచ పారా అథ్లెట్​ ఛాంపియన్​షిప్​లో భారత్​కు స్వర్ణం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.