ETV Bharat / state

కదిరిలో మెప్మా అధికారి తీరుపై మహిళల ధర్నా

author img

By

Published : Jan 28, 2020, 10:18 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో మెప్మాలో పనిచేస్తున్న అధికారి... మహిళలు, ఆర్పీల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ స్వయం సహాయక సంఘాల సభ్యులు నిరసన చేపట్టారు.

mepma-resorce-persons-ladies-protest-in-ananthapuram-district
కదిరిలో మెప్మా అధికారి చర్యలపై మహిళలు ధర్నా

మెప్మాలో పనిచేస్తున్న టౌన్​మిషన్​ కోఆర్డినేటర్​ శ్రీనివాస్​ రెడ్డి... మహిళలు, రిసోర్స్​ పర్సన్స్​ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ... స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారి తీరును నిరసిస్తూ... కదిరిలో ధర్నా చేపట్టారు. మహిళలతో దురుసుగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్​ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మహిళలకు భాజపా, జనసేన నాయకులు మద్దతు పలికారు. దాదాపు 15 ఏళ్లుగా ఆర్పీలు​గా పనిచేస్తున్న వారిని... శ్రీనివాస్​ తొలగిస్తున్నారని మహిళలు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారినే ఆర్పీలుగా నియమించాలంటూ... అతన్ని ఆదేశించారని మహిళలు వాపోయారు.

కదిరిలో మెప్మా అధికారి తీరుపై మహిళల ధర్నా

మెప్మాలో పనిచేస్తున్న టౌన్​మిషన్​ కోఆర్డినేటర్​ శ్రీనివాస్​ రెడ్డి... మహిళలు, రిసోర్స్​ పర్సన్స్​ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ... స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారి తీరును నిరసిస్తూ... కదిరిలో ధర్నా చేపట్టారు. మహిళలతో దురుసుగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్​ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మహిళలకు భాజపా, జనసేన నాయకులు మద్దతు పలికారు. దాదాపు 15 ఏళ్లుగా ఆర్పీలు​గా పనిచేస్తున్న వారిని... శ్రీనివాస్​ తొలగిస్తున్నారని మహిళలు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారినే ఆర్పీలుగా నియమించాలంటూ... అతన్ని ఆదేశించారని మహిళలు వాపోయారు.

కదిరిలో మెప్మా అధికారి తీరుపై మహిళల ధర్నా

ఇదీ చదవండి :

వెలుగు, మెప్మా ఉద్యోగులకు తెదేపా మద్దతు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_48_28_Mepma_RPS_Dhrna_AVB_AP10004


Body:పొదుపు సంఘాల మహిళలు, రిసోర్స్ పర్సన్స్ పట్ల మెప్మా అధికారి తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో మహిళలు ధర్నా చేపట్టారు. పొదుపు మహిళలకు భారతీయ జనతా పార్టీ ,జనసేన నాయకులు మద్దతు తెలిపారు. మెప్మా లో పనిచేస్తున్న టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి పొదుపు మహిళలు, రిసోర్స్ పర్సన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ మహిళలు ఆందోళన దిగారు. దాదాపు 15 సంవత్సరాలుగా రిసోర్స్ పర్సన్స్ గా పనిచేస్తున్న వారిని శ్రీనివాస్ రెడ్డి తొలగిస్తున్నారని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారే రిసోర్స్ పర్సన్ గా ఉండాలని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారని మహిళలు వాపోయారు. సంఘాల అభివృద్ధి చేసుకుని రిసోర్స్ పర్సన్స్ గా కుటుంబాన్ని పోషించు కుంటున్న తమని అర్ధాంతరంగా తొలగించడాన్ని వ్యతిరేకించారు. మహిళలతో దురుసుగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్స్ విషయంలోనూ రాజకీయం చేయడం బాధాకరమని భాజపా, జనసేన నాయకులు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్స్ విషయంలో రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని సూచించారు


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.