ETV Bharat / state

మరవ తండాలో బైక్​ బోల్తా...లోయలో పడి ఒకరు మృతి

author img

By

Published : Sep 22, 2020, 4:18 PM IST

ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడిన ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం మరవ తండాలో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరవ తండా గుంతలో పడి బైక్​ బోల్తా...ఒకరు మృతి
మరవ తండా గుంతలో పడి బైక్​ బోల్తా...ఒకరు మృతి

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవ తండా వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాండ్లపెంట మండలం మద్దివారి గొంది గ్రామానికి చెందిన భాస్కర్ కదిరి నుంచి సొంత ఊరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయాలు కావటంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటినుంచి బయలుదేరిన భాస్కర్ ఇంటికి చేరకపోవటం..ఫోన్​ ఎత్తని కారణంగా కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. వెంటనే కుటుంబసభ్యులు కదిరికి బయలుదేరారు. రోడ్డు పక్కన పడి ఉన్న భాస్కర్​ని గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అచేతనంగా పడి ఉన్న ఆయనను చూసి బోరున విలపించారు. కదిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవ తండా వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాండ్లపెంట మండలం మద్దివారి గొంది గ్రామానికి చెందిన భాస్కర్ కదిరి నుంచి సొంత ఊరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయాలు కావటంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటినుంచి బయలుదేరిన భాస్కర్ ఇంటికి చేరకపోవటం..ఫోన్​ ఎత్తని కారణంగా కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. వెంటనే కుటుంబసభ్యులు కదిరికి బయలుదేరారు. రోడ్డు పక్కన పడి ఉన్న భాస్కర్​ని గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అచేతనంగా పడి ఉన్న ఆయనను చూసి బోరున విలపించారు. కదిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.