అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవీ గ్రామ శివార్లలో ఉన్న ఆలయానికి పలువురు మహిళతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమె బహిర్భూమికని వెళ్లిన సమయంలో పాము కాటేసింది. ఈ విషయం గమనించిన తోటి మహిళలు వెంటనే లక్ష్మీదేవిని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి : ఆవు దాడిలో.. మహిళ ప్రాణం ఆవిరి