దీపం పథకం ఉన్న ప్రతి ఒక్కరికీ మూడు నెలల పాటు వంటగ్యాస్ ఉచితంగా ఇవ్వాలని అనంతపురం జిల్లాలో ఐద్వా మహిళా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలు పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..