ETV Bharat / state

కరెన్సీ దండలతో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - ధర్మవరంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

లాక్ డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని వారు చేస్తున్న కృషి అభినందనీయమని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అన్నారు.

Honor for sanitation workers with currency wands
కరెన్సీ దండలతో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
author img

By

Published : Apr 13, 2020, 5:12 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలోని మూడవ డివిజన్ కార్మికులను స్థానిక వైకాపా నాయకుడు నారాయణమూర్తి, అతని మిత్ర బృందం కరెన్సీ నోట్లతో సన్మానించారు. కొత్తపేట కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ తో కలిసి కార్మికులను వైకాపా నాయకులు సన్మానించారు. ఒక్కో కార్మికుడికి వెయ్యి రూపాయల కరెన్సీ దండను వేశారు. అంతేగాక వారికి మాస్కులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు.

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలోని మూడవ డివిజన్ కార్మికులను స్థానిక వైకాపా నాయకుడు నారాయణమూర్తి, అతని మిత్ర బృందం కరెన్సీ నోట్లతో సన్మానించారు. కొత్తపేట కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ తో కలిసి కార్మికులను వైకాపా నాయకులు సన్మానించారు. ఒక్కో కార్మికుడికి వెయ్యి రూపాయల కరెన్సీ దండను వేశారు. అంతేగాక వారికి మాస్కులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:కరోనా వ్యాప్తి నివారణకు పీవీ సిద్ధారెడ్డి సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.