అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌరవిద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకొని వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి హంద్రీనీవా కాల్వలో పడింది. స్టెర్లింగ్ కంపెనీలో సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులు ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అన్సారీతో పాటు మహమ్మద్ జిల్ ఉల్లాహ్, సఫార్ ఆలం, మన్సూర్ అన్సారీలు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. కదిరి ఆర్డీవో రామసుబ్బయ్య ఆసుపత్రికి వెళ్లి మృతుల వివరాలను తెలుసుకున్నారు.
ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి