అనంతపురం జిల్లా ధర్మవరంలోని సుదర్శన్ కూడలి వద్ద ద్వారక మయ హోల్ సేల్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. కరెంట్ నిలిచిన అనంతరం ఒక్కసారిగా మళ్లీ విద్యుత్ రావటంతో ఇన్వర్టర్ నుంచి సర్ట్ సర్య్కూట్ జరిగింది. ఇందువల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 50 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని వస్త్ర దుకాణం యజమాని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..